అమరావతి: నీరు-ప్రగతి, వ్యవసాయం పురోగతిపై సీఎస్ దినేశ్కుమార్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జన్మభూమి-మాఊరులో వచ్చిన వినతుల పరిష్కారంపై కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సీఎస్ దినేష్కుమార్ సూచించారు. ఖరీఫ్లో పంటరుణాల పంపిణీ సంతృప్తిగా జరిగిందన్న ఆయన రబీలో పంటరుణాల పంపిణీ 4 జిల్లాల్లో మందకొడిగా ఉందన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కౌలు రైతులకు పంట రుణాలు వేగవంతం కావాలని ఆదేశించారు. 2016-17 ఇళ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని, 2017-18 ఇళ్ల మంజూరు వెంటనే పూర్తి చేయాలన్నారు. ఉపాధి హామీ పనులకు కలెక్టర్లే నేతృత్వం వహించాలని సూచించారు.