ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు జస్టిస్ లోయా మృతి కేసు విచారణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 22, 2018, 10:44 AM

న్యూఢిల్లీ : సుప్రీం కోర్టులో  జస్టిస్ లోయా మృతి కేసు విచారణ నేడు జరగనుంది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ కేసు విచారించనుంది. జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్, జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌, జస్టిస్‌ మదన్‌ బి.లోకూర్‌, జస్టిస్‌ కురియన్‌ జోసెఫ్‌ లు ఈ కేసు విచారణను జూనియర్ న్యాయమూర్తి అయిన జస్టిస్ అరుణ్ మిశ్రా బెంచ్ కు అప్పగించడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ కేసు విచారణ నుంచి జస్టిస్ అరుణ్ మిశ్రా స్వచ్ఛందంగా వైదొలిగారు. దీంతో సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలో జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్ లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ కేసు విచారణ చేపట్టనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com