చిత్తూరు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి 68వ రోజు ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభమైంది. జగన్ తన 68వ రోజు పాదయాత్రను శ్రీకాళహస్తి శివారులో పానగల్ నుంచి ప్రారంభించారు. పాదయాత్ర తంగెళ్లమిట్ట, పర్లపల్లి, పల్లమల, కత్తివారి కండ్రిగ, బసవనగుంట, అల్లత్తుర్ క్రాస్, పట్టాభిరెడ్డి గిరిజన కాలనీ మీదుగా రెడ్డిగుంటబడవ వరకు కొనసాగనుంది. పాదయాత్రలో భాగంగా పల్లమాలలో ఎస్సీల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు.