క్రికెట్ బెట్టింగ్లో బూకీలు ఎలక్ట్రానిక్ కమ్యూనికేటర్ను ఉపయోగిస్తున్నారు. ఇక్కడ గ్రౌండ్లో ఉంటూ సమాచారం బుకీకి ఇచ్చేందుకు ఒక కమ్యూనికేటర్ వ్యవస్థను వాడుతుండగా, బుకీ నుంచి ఫంటర్లకు ఉపయోగించేందుకు మరో కమ్యూనికేటర్ను వాడుతున్నారు. ఒకేసారి బుకీ 36 మందికి కమ్యూనికేటర్ ద్వారా సెకెండ్లో సమాచారం ఇచ్చేందుకు అస్కారం ఉంటుంది. గ్రౌండ్లో ఆడే ఆటకు, టీవీలలో ప్రదర్శించే గేమ్కు మధ్య 7 సెకండ్ల వ్యవధి ఉంటుంది.
గ్రౌండ్ లో ఉండే వ్యక్తి ఒకేసారి దేశ వ్యాప్తంగా ఉన్న బుకీలకు సమాచారం ఇస్తాడు. ఇందుకు ఒక సెకెండ్ సమయం పడుతుంది... బుకీలు అది చూసి మరో సెకెండ్లో ఫంటర్లకు ఫలాన బాల్లో ఎన్ని రన్నులు కొడుతాడంటూ బెట్టింగ్ చేస్తా రు. బుకీకి గ్రౌండ్లోని ప్లేయర్ ఎన్ని రన్నులు కొట్టాడనే విషయం స్పష్టంగా తెలిసి ఉంటుంది, అయితే ఫంటర్లకు కమ్యూనికేటర్ ద్వారా చెప్పే సమయంలో ప్లేయర్ కొట్టిన రన్నుల విషయాన్ని దాచేస్తారు.
బుకీ ఆ విషయాన్ని ఫంటర్లకు చెప్పే సమయంలో ప్రస్తావించకపోవడంతో టీవీలలో ఆటను చూస్తూ ఫంటర్లు బెట్టింగ్ కాస్తారు. దీంతో ఫంటర్లు ఎప్పటికీ మోసపోతుంటారు. దీంతో బుకీలు ఫంటర్లలో నమ్మకం కల్గించేందుకు 10 బాల్స్లలో 8 బాల్స్లో అబద్దం చెబుతూ.. మరో 2 బా ల్స్లో వాస్తవం చెబుతూ నమ్మకాన్ని కుదిర్చే ప్రయత్నం చేస్తుంటారు. అస్ట్రేలియాలో ఉండే ఒక ప్లేయర్ ఒక బాల్కు 6 పరుగులు తీశాడంటే.. ఆ విషయాన్ని దాచేసి ఈ బాల్కు 4, 2, వికెట్, నోబాల్ అంటూ బుకీ ఫంటర్లను మోసం చేస్తుంటాడు. ఇదంతా అత్యంత వేగంగా కమ్యూనికేషన్ను చేరవేస్తున్న కమ్యూనికేటర్ను ఉపయోగించి బుకీలు ఈ దందాను సాగిస్తున్నారు.