కావలసిన పదార్ధాలు : నువ్వులు - 100గ్రా., బెల్లం - పావుకేజీ, నెయ్యి - 50గ్రా., కొబ్బరి తురుము - 1 కప్పు, యాలకుల పొడి - కొద్దిగా, డ్రై ఫ్రూట్స్ ముక్కలు.
తయారీవిధానం:
-- పొయ్యిమీద చిన్న కళాయి పెట్టి, నువ్వులను నూనె, నెయ్యి లేకుండా దోరగా వేపుకోవాలి. ఆపై రోలులో వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి.
-- ఇప్పుడు అదే కళాయిలో చితక్కొట్టిన బెల్లం తరుగు, నీళ్లు పోసి పాకం సిద్ధం చేసుకోండి. ఒక కప్పు బెల్లం తురుముకు ఒక కప్పు నీళ్లు పొయ్యాలి.
-- పాకం మరీ ముదురుగా కాకుండా, మరీ లేతగా కాకుండా మధ్యస్థంగా ఉండేలా చూసుకోవాలి. ఈ క్రమంలో పాకంలో యాలకుల పొడి, కొబ్బరి తురుము నెయ్యి వెయ్యండి.
-- కొంచెంసేపటి తర్వాత ఈ పాకంలో ఇందాక దంచుకున్న నువ్వులను వేసి బాగా కలిపి వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
--ఈ మిశ్రమం బాగా చల్లారిన తర్వాత చిన్న ఉండలుగా చేసుకోండి. వాటికి డ్రై ఫ్రూట్స్ ముక్కలను గార్నిష్ చేస్తే ఇంకా బావుంటుంది.