ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోలింగ్ ముందు బిగ్ ట్విస్ట్.. ఏపీ డీజీపీపై ఈసీ బదిలీ వేటు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, May 05, 2024, 07:27 PM

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని తక్షణమే బదిలీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి ఆదేశాలు జారీ చేసింది. ఆయనకు ఎలాంటి ఎన్నికల విధులు అప్పగించవద్దని స్పష్టం చేసింది. డీజీపీగా కింది ర్యాంకు అధికారికి బాధ్యతలు అప్పగించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. సోమవారం ఉదయం 11 గంటలలోగా ముగ్గురు డీజీ ర్యాంకు అధికారుల జాబితా పంపాలని ఎన్నికల సంఘం సీఎస్‌ను ఆదేశించింది.


మరోవైపు ఏపీ డీజీపీ.. అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఏపీ డీజీపీని, సీఎస్‌ను మార్చాలంటూ గత కొంతకాలంగా విపక్షాల నుంచి పెద్ద సంఖ్యలో ఈసీకి ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిని బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసింది. ఆయన స్థానంలో సోమవారం ఉదయం 11 గంటల లోపు కొత్త డీజీపీని నియమించాలంటూ ఆదేశించింది.


మరోవైపు డీజీపీ పదవికి రాజేంద్రనాథ్ రెడ్డి అనర్హుడని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్నికల్లో ఆయన పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అధికార వైసీపీ అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. కోడ్ అమల్లోకి వచ్చాక ఒక్కసారి కూడా విలేకర్ల సమావేశం నిర్వహించలేదని టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శించారు. జగన్ సేవలో తరించడమే డీజీపీ డ్యూటీగా మారిపోయిందని వర్ల రామయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com