ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కోన‌సీమ అల్లర్లపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 03, 2022, 09:19 PM

అమలాపురంలో జరిగిన అల్లర్లపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి శుక్రవారం విజయవాడ వచ్చిన పవన్ కళ్యాణ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కోనసీమ అల్లర్లు ఉద్దేశపూర్వకంగానే జరుగుతున్నాయని ఆరోపించారు.అల్లర్ల గురించి ఇంటెలిజెన్స్ విభాగానికి ఎందుకు తెలియజేయలేదని ప్రశ్నించిన పవన్.. గొడవలు జరుగుతాయని ప్రభుత్వానికి ముందే తెలుసని ఆరోపించారు. స‌మ‌స్య అంబేద్క‌ర్ పేరు కాద‌న్న ప‌వ‌న్‌.. ఒక పార్టీలో రెండు వ‌ర్గాల మ‌ధ్య గొడ‌వే అల్ల‌ర్ల‌కు కార‌ణ‌మ‌ని తెలిపారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com