ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వచ్చే ఎన్నికల్లో ముక్కోణపు పోరు ఉండదు: ఉండవల్లి అరుణ్ కుమార్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 24, 2022, 09:17 PM

ఏదేమైనా ఏపీలో వచ్చే ఎన్నికల్లో ముక్కోణపు పోరు ఉండదని భావిస్తున్నానని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పేర్కొన్నారు. ఏపీలో సీఎం జగనే కొనసాగాలని బీజేపీ భావిస్తే పొత్తులు ఉండకపోవచ్చని, ఏపీలో రాజకీయం ఎలా ఉంటే మనకేంటని బీజేపీ భావిస్తే మాత్రం పొత్తులు ఉంటాయని వివరించారు.


ఇదిలావుంటే ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉండగా, పొత్తుల గురించిన అంశాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. దీనిపై సీనియర్ రాజకీయవేత్త, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు. వచ్చే ఎన్నికల నాటికి ఏదైనా జరగొచ్చని అభిప్రాయపడ్డారు. ఏపీలో బీజేపీ, జనసేన విడిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదని అన్నారు. అదే సమయంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ మాటలు చూస్తుంటే టీడీపీ, జనసేన మళ్లీ కలుస్తాయని భావిస్తున్నట్టు తెలిపారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com