ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాడు ఫిజ్జాల కోసం బిట్ కాయిన్లు చెల్లించాడు...నేడు ధనవంతుడయ్యే అవకాశం కోల్పోయాడు

international |  Suryaa Desk  | Published : Tue, May 24, 2022, 06:57 PM

ఏదైనా మన తలరాతను బట్టే ఉంటుందంటా. ఎంతచేసినా మనకు ఎంత రాసిపెట్టివుంటే అంతే దక్కుతుంది. ఏదైనా కాల మహిమా. ఇక వివరాలలోకి వెళ్లితే...పన్నెండేళ్ల క్రితం ఫ్లోరిడియన్‌కు చెందిన ఓ ప్రోగ్రామర్‌కి పిజ్జా తినాలనిపించింది. రెండు పిజ్జాలను కొనుగోలు చేయాలనుకున్నాడు. అనుకున్న మాదిరిగానే పిజ్జాలను కొనుగోలు చేశాడు. అయితే ఈ పిజ్జాల కోసం ఆయన బిట్ కాయిన్లను వాడాడు. క్రిప్టోలను వాడుతూ తొలిసారి ప్రపంచంలోనే అత్యంత రికార్డు స్థాయిలో ఈ కొనుగోలును చేపట్టాడు లాస్లో హన్యెక్జ్. కానీ ఇప్పుడు ఆ బిట్ కాయిన్ల ఖరీదు ఏకంగా రూ.2 వేల కోట్ల పైమాటే. అసలు పన్నెండేళ్ల క్రితం జరిగిన ఆ కథేంటి..? బిట్ కాయిన్ పిజ్జా డేను ఎందుకు హన్యెక్జ్ జరుపుకుంటున్నారో మనం ఓ సారి తెలుసుకుందాం..


హన్యెక్జ్ 2010 మే 18న రెండు పిజ్జాలను కొనుగోలు చేయాలనుకున్నాడు. వాటికి బిట్ కాయిన్ రూపంలో చెల్లింపులు చేయాలనుకున్నాడు. ఇదే విషయాన్ని బిట్‌కాయిన్‌టాక్ డాట్ ఓఆర్‌జీ‌ ఫోరమ్‌లో తెలిపాడు. ఎవరైతే తనకు ఈ ఆర్డర్ అందిస్తారో వారికి 10 వేల బిట్‌కాయిన్లను చెల్లించనున్నట్టు పేర్కొన్నాడు. పిజ్జాలను అందించి క్రిప్టో కరెన్సీలను స్వీకరించాల్సిందిగా పేర్కొన్నాడు. కానీ అంత త్వరగా ఈ ఆర్డర్ స్వీకరించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. రోజుల తరబడి వేచిచూశాడు. ఈ విషయంపై హన్యెక్జ్ ఎంతో బాధపడ్డాడు. ఆశలన్ని వదులుకున్నాడు. కానీ ఆ తర్వాత అతనికి ఓ 19 ఏళ్ల జెరెమీ స్టర్డివాంట్ నుంచి రెస్పాన్స్ వచ్చింది.


2010 మే 22న 10 వేల బిట్‌కాయిన్లకు రెండు పిజ్జాలను అందించేందుకు జెరెమీ అంగీకరించాడు. ఈ పిజ్జాలను అందుకున్న తర్వాత హన్యెక్జ్ పిజ్జాలను అందుకున్న విషయాన్ని తెలియజేస్తూ తన ఫ్యామిలీతో కలిసి ఉన్న ఫోటోను అప్పట్లో షేర్ చేశాడు కూడా. అప్పట్లో ఆ బిట్ కాయిన్ల ఖరీదు కేవలం 40 డాలర్లు మాత్రమే. అయితే హన్యెక్జ్ ఆ రోజును తలుచుకుని ఇప్పుడు బాధపడుతున్నాడు. ఎందుకంటే ఈ పిజ్జాల కోసం ఖర్చు చేసిన 10 వేల బిట్ కాయిన్ల ఖరీదు ప్రస్తుతం రూ.2,260 కోట్లు. ఇప్పుడు అతని చేతిలో ఆ బిట్ కాయిన్లు ఉండుంటే నిజంగా కోట్లాధిపతినే. కానీ ఆ రోజు పిజ్జా కోసం ఈ బిట్ కాయిన్లను అమ్మేసుకున్నాడు. బిట్ కాయిన్ ధర ఆల్ టైమ్ గరిష్టాల్లో ఉన్నప్పుడు వాటి ధర రూ.5,175 కోట్లు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com