ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిద్రమత్తే ప్రాణాలు తీసింది..8 మంది దుర్మరణం

national |  Suryaa Desk  | Published : Mon, May 23, 2022, 03:27 PM

8 మంది వలస కూలీలు దుర్మరణం చెందిన ఘటన బీహార్‌ రాష్ట్రంలో చోటుచేసుకుంది. పైపుల లోడ్‌తో వెళ్తున్న లారీ అదుపు తప్పడంతోనే ఈ ఘటన సంభవించింది. లారీ బోల్తా పడటం వల్లే 8 మంది ప్రాణాలు పోగోట్టుకున్నారు. ఈ ప్రమాదంలో మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. పూర్ణియా జిల్లాలోని జాలాల్​గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం ఉదయం ఈ ఘోరం కలకలం రేపింది.


సిలిగురి నుంచి జ‌మ్మూకు లారీ వెళ్తుండ‌గా అందులో వలస కూలీలు ఉన్నారు. చనిపోయినవారందరూ రాజ‌స్తాన్‌ కు చెందిన వారిగా పోలీసులు నిర్దారించారు. అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. డ్రైవర్​ నిద్రమత్తే 8 మంది ప్రాణాలకు కారణమైందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com