ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యాపిల్, సామ్‌సంగ్‌ కంపెనీలకు జరిమానాలు...ఎందుకంటే

national |  Suryaa Desk  | Published : Mon, May 23, 2022, 12:37 PM

మొబైళ్లతో పాటు చార్జర్‌లను ఇవ్వడంమానేయడంతో యాపిల్, సామ్ సంగ్ లకు జరిమానాలు పడ్డాయి. ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థలు యాపిల్, సామ్‌సంగ్‌ కంపెనీలు జరిమానాలకు ఇవే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. లీగల్ యాక్షన్‌ను సైతం ఎదుర్కొనే పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది. ఇందుకు ఓ కారణం ఉంది. ఐఫోన్ 12 సిరీస్ నుంచి మొబైళ్లతో పాటు చార్జర్‌లను ఇవ్వడం యాపిల్ మానేసింది. బాక్స్‌లో చార్జింగ్ అడాప్టర్‌ను ఇవ్వడం లేదు. సామ్‌సంగ్‌ కూడా అదే బాట పట్టింది. గెలాక్సీ ఎస్21 సిరీస్‌ మొబైళ్ల బాక్స్‌లో చార్జర్‌ను తొలగించింది. కేవలం యూఎస్‌బీ టైప్-సీ కేబుల్ మాత్రమే ఇస్తోంది. ఇటీవల కొన్ని మిడ్ రేంజ్‌ స్మార్ట్‌ఫోన్‌లతోనూ చార్జర్‌ను ఇవ్వడం లేదు. ఇప్పుడు ఇదే యాపిల్, సామ్‌సంగ్‌కు ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. ఇలా కొత్త మొబైల్‌తో పాటు చార్జింగ్ అడాప్టర్‌ను ఇవ్వకపోతుండడంతో టెక్ దిగ్గజాలు యాపిల్, సామ్‌సంగ్‌ జరిమానాను ఎదుర్కొంటున్నాయని సమాచారం.


ప్రపంచంలోని వివిధ దేశాల్లో యాపిల్, సామ్‌సంగ్‌కు జరిమానాలు పడేందుకు మొబైళ్లతో పాటు చార్జర్‌లు ఇవ్వకపోవడమే కారణంగా మారుతోంది. కొన్ని దేశాల్లో వినియోగదారుల హక్కుల సంఘాలు అక్కడి కోర్టులను ఆశ్రయిస్తున్నాయి.ఇప్పటికైతే, యాపిల్‌కు బ్రెజిల్‌లో జరిమానా పడింది. ఫోన్‌లతో చార్జింగ్ అడాప్టర్‌లు ఇస్తుండని కారణంగా జరిమానా చెల్లించాలని బ్రెజిల్‌లోని ఓ కోర్టు యాపిల్‌ను ఆదేశించిందని టెలీకంపేరర్ రిపోర్ట్ వెల్లడించింది. చార్జర్‌ను ఇవ్వకూడదని యాపిల్ నిర్ణయించుకోవడం అక్రమమని వ్యాఖ్యలు చేసిందని తెలిపింది. కాగా బ్రెజిల్‌లో సామ్‌సంగ్‌ సైతం ఫైన్‌ను ఎదుర్కొంటోంది.


కొత్త మొబైళ్లతో చార్జింగ్ అడాప్టర్‌ను ఇవ్వకుండా వినియోగదారుల చట్టాన్ని ఉల్లఘించిన కారణంగా ఒక్కో ఐఫోన్ కొనుగోలుపై యాపిల్ 1,081 డాలర్ల ఫైన్ చెల్లించాలని బ్రెజిల్‌లోని ఓ కోర్టు ఆదేశాలు జారీ చేసిందని గిజ్‌మోచైనా రిపోర్ట్ చేసింది. అలాగే సామ్‌సంగ్‌కు సైతం ఇలాంటి ఆదేశాలనే ఇచ్చిందని వెల్లడించింది. ఇదిలావుంటే యాపిల్, సామ్‌సంగ్‌.. ఫోన్‌ బాక్స్‌ల్లో అడాప్టర్‌ను తొలగించిన అంశంపై 900వరకు వినియోగదారుల హక్కుల గ్రూప్స్.. యాపిల్, సామ్‌సంగ్‌పై న్యాయ చర్యలు తీసుకునేందుకు సిద్ధయ్యాయని బ్రెజిల్ న్యాయ శాఖ వెల్లడించింది. జరిమానాతో పాటు దీనికి తగిన పరిష్కారం కోసం పోరాడుతున్నాయని పేర్కొంది.


ఈ-వేస్ట్‌ను కట్టడి చేసేందుకే ఐఫోన్‌లతో పాటు చార్జర్‌లను ఇవ్వడం లేదని యాపిల్ చెప్పింది. పాత ఫోన్‌ చార్జర్‌నే వినియోగదారులు వినియోగించుకోవచ్చని పేర్కొంది. అయితే చార్జర్‌ తొలగించడంతో దాని వ్యయంతో పాటు రవాణా ఖర్చులు సైతం యాపిల్‌కు భారీగా తగ్గాయి. మొత్తంగా ఫోన్‌లతో పాటు చార్జర్‌లు ఇవ్వనందున తమ సంస్థకు 6.5 బిలియన్లు ఆదా అయ్యాయని యాపిల్ స్వయంగా చెప్పింది. అలాగే చార్జర్‌‌లు ప్రత్యేకంగా విక్రయించినందుకు మరింత ఆదాయం పొందింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com