ఏపీ సీఎం జగన్కు ఆత్మకూరు మండలానికి చెందిన ఓ యువకుడు వీడియో సందేశం పంపారు. తమ పొలంలోకి వేరేవాళ్లు చొరబడి దౌర్జన్యం చేశారని ఫిర్యాదు చేశారు. తనను, తన తల్లిని కొట్టబోయారని యువకుడు ఆరోపించారు. 30 ఏళ్లుగా పొలాన్ని సాగు చేస్తున్నామని, కొందరు బెదిరిస్తున్నారని, తమ ఫిర్యాదుపై పట్టించుకోవాలని కోరారు. సీఎం, కలెక్టర్, ఎస్పీ స్పందించాలని విజ్ఞప్తి చేశారు.