సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల నియామకానికి 9 మంది జడ్జిల పేర్లను కొలీజియం సిఫార్సు చేసింది. వీరిలో ముగ్గురు మహిళా న్యాయమూర్తులు ఉన్నారు. కొలీజియం సిఫార్సు చేసిన పేర్లలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.వి. నాగరత్న, గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బేలా త్రివేది, సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సి.టి. రవికుమార్, కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎం. సుందరేష్, కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎ.ఎస్.ఓకా, గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్నాథ్, సీనియర్ న్యాయవాది పీఎన్ నరసింహ పేర్లు ఉన్నాయి. అయితే వీరిలో జస్టిస్ బి.వి. నాగరత్న పేరును కేంద్రం ఆమోదిస్తే గనుక 2027లో ఆమె భారత తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టే అవకాశముంది.