ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో టోకెన్ ఉంటేనే ఇకపై వ్యాక్సిన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 11, 2021, 05:17 PM

ఏపీలో వ్యాక్సిన్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే చాలా జిల్లాల్లో ఫస్ట్ డోస్ టీకా వేయక చాలా రోజులైంది. ఇక సెకెండ్ డోస్ కు శుక్రవారం నుంచి బ్రేకులు పడ్డాయి. రెండో శనివారం, ఆదివారం సెలవుల పేరుతో ఎక్కడా వ్యాక్సిన్ వేయలేదు. ఇక సోమ, మంగళవారం టీకాలు వేయొద్దని ప్రభుత్వ సూచనలతో బ్రేకులు పడ్డాయి. అయితే ఇకపై టోకెన్ ఉన్నవారికి మాత్రమే సెకెండ్ డోస్ వేయాలని అధికారులు నిర్ణయించారు. కేంద్రం నుంచి వాక్సిన్ వచ్చేలోపు ఉన్న సమయాన్ని సద్వినియోగించుకునే రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానాలను అమలు చేస్తోంది. వాక్సిన్ కేంద్రాల సంఖ్య పెంచేందుకు కసరత్తు ప్రారంభించింది. ప్రతీ సెంటర్ వద్ద రెండు వెయిటింగ్ హాల్స్, 45 ఏళ్ళు నిండిన వారికి ముందు సెకండ్ డోస్ వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com