కరోనా వైరస్ దెబ్బకు రోగనిరోధక శక్తి పెంచుకోవడంపై అందరూ దృష్టి సారించారు. ప్రతి ఒక్కరూ సి విటమిన్ అధికంగా కలిగిన ఆహారం, పండ్లు, ఆయుర్వేద మందులు తీసుకుంటున్నారు. మరి కొందరు క్రమం తప్పకుండా సి విటమిన్ ట్యాబ్లెట్లను వినియోగిస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. సి విటమిన్ మోతాదు ఎక్కువైతే ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వృద్ధులు, ఉబ్బసం, డయాబెటిక్, గుండె రోగులు విటమిన్ సి మాత్రలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. విటమిన్ సి రూపంలో తీసుకునే మందులు హానికరం అంటున్నారు. మోతాదుకు మించి తీసుకోవడం వల్ల మాత్రలు మూత్రపిండాల్లో రాళ్ళు, విరేచనాలు, కడుపు నొప్పి, తిమ్మిరి వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు. అలాగే కషాయాల వల్ల ప్రయోజనం ఉన్నప్పటికీ వేసవిలో ఎక్కువగా తీసుకుంటే గుండెల్లో మంట, గ్యాస్ సమస్య వస్తుందంటున్నారు. అయితే మోతాదుకు సరిపడా తీసుకోవడం ద్వారా ఎటువంటి ప్రమాదం లేదంటున్నారు.