ఏపీ రాజకీయాల్లో ఎన్-440 కే దుమారం కొనసాగుతోంది. మాజీ సీఎం చంద్రబాబుపై కేసులకు కౌంటర్ గా మంత్రి సిదిరి అప్పలరాజుపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఎన్-440 కే వేరియంట్ కర్నూలు లో ఉందని మంత్రి అప్పల రాజు అన్నారని టీడీపీ ఫిర్యాదులో పేర్కొంది. చంద్రబాబుపై కేసు పెట్టిన కర్నూలు 1 టౌన్ పీఎస్ లోనే ఫిర్యాదు చేశారు. టీడీపీ ఆరోపణలపై మంత్రి అప్పలరాజు స్పందించారు. ఎన్-440 కే వైరస్ విషయంలో ఒక వైద్యుడిగా నా అభిప్రాయాన్ని చెప్పానని అన్నారు. వైరస్ విషయంలో చంద్రబాబు నాయుడు మాత్రం ప్రజలను భయపెట్టారని అన్నారు. చంద్రబాబుపై పెట్టిన కేసులు తనపై పెట్టాలని జైలుకు వెళ్లడానికైనా రెడీగా ఉన్నానని మంత్రి అన్నారు. అయితే చంద్రబాబుకు మాత్రం శిక్ష విధించాలని అన్నారు. కరోనా వ్యాప్తికి టీడీపీ నేతలే కారణమన్నారు.