ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు మద్యం అమ్మకాలపై ఉన్న ఆరాటం ప్రజల ఆరోగ్యంపై లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ విమర్శించారు. కరోనా వ్యాక్సిన్ సెంటర్ల వద్ద భౌతిక దూరం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఈ మేరకు గతంలో మద్యం దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించేలా చేసిన ఏర్పాట్లు, తాజాగా వ్యాక్సిన్ సెంటర్ వద్ద ఉన్న పరిస్థితిని వివరిస్తూ ట్విట్టర్ లో ఓ వీడియోను జత చేశారు.