ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్టార్​ రెజ్లర్ సుశీల్ కుమార్ పై కేసు నమోదు

national |  Suryaa Desk  | Published : Thu, May 06, 2021, 04:08 PM

ఒలింపిక్స్‌లో భారత్‌ తరఫున రెండు వ్యక్తిగత పతకాలు సాధించిన ఏకైక రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ఉత్తర ఢిల్లీలోని ఛత్రాసాల్‌ స్టేడియంలో మంగళవారం రాత్రి రెజ్లర్ల మధ్య జరిగిన గొడవలో 23 ఏండ్ల సాగర్‌ మృతిచెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. సంఘటనా స్థలంలో లభించిన ఐదు వాహనాలు, ఒక తుపాకీని స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ గురిఖ్‌బాల్‌ సింగ్‌ సిద్ధు పేర్కొన్నారు. ఈ ఘటనలో స్టార్‌ రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌ పాత్రను పరిశీలిస్తున్నామన్నారు. ఇంకా మరిన్ని విషయాలు గురిఖ్‌బాల్‌ సింగ్‌ సిద్ధు తెలిపారు. ఆయన మాట్లాడుతూ..మోడల్ టౌన్ ప్రాంతానికి చెందిన ఛత్రపాల్ స్టేడియం సమీపంలో ఇండియన్‌ రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌కు చెందిన ఇంట్లో సాగర్ మరియు అతని స్నేహితులు ఉంటున్నారు. అయితే వారిని ఖాళీ చేయమని కోరారు.


ఆ విషయంలో ఇరువర్గాల మధ్య సుమారు 4 గంటల పాటు ఘర్షణ జరిగినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఛత్రసల్ స్టేడియం సమీపంలో ఇద్దరు వ్యక్తులు తుపాకీతో ఇతరులపై కాల్పులు జరిపినట్లు పోలీస్‌ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందింది. దీంతో ఘటనస్థలానికి చేరుకున్న మోడల్‌ స్టేషన్‌ పోలీసులు ఘటనా స్థలంలో ఢిల్లీ పోలీస్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ కుమారుడు సాగర్‌ కుమార్‌ మృతి చెందగా సోను మహల్ (35), అమిత్ కుమార్ (27) గుర్తించినట్లు తెలిపారు. దలాల్ (24) అనే యువకుడిని అరెస్ట్‌ చేసి పార్క్‌ చేసిన ఓ వాహనంలో బుల్లెట్లు లోడ్‌ చేసిన గన్‌ ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. కేసు దర్యాప్తు భాగంగా సుశీల్‌ కుమార్‌ కోసం వాళ్ల ఇంట్లో సోదాలు చేశాం. అక్కడ సుశీల్‌ కుమార్‌ లేడు. పోలీసులు బృందాలుగా విడిపోయి సుశీల్‌ కుమార్‌ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com