కోవిడ్ 19 నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్పై గుంటూరు జిల్లా తాడేపల్లి లోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి (వైద్య, ఆరోగ్యశాఖ) ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని), చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్, కోవిడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ స్పైషల్ ఆఫీసర్ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్కుమార్ సింఘాల్, కోవిడ్ టాస్క్ఫోర్స్ కమిటీ ఛైర్మన్ ఎం టీ కృష్ణబాబు, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి (కోవిడ్ మేనేజ్మెంట్) ముద్దాడ రవిచంద్ర, 104 సేవల విభాగం ఇన్ఛార్జి బాబు ఏ. కుటుంబ సంక్షేమ కమిషనర్ కాటమనేని భాస్కర్, ఆర్ధికశాఖ కార్యదర్శి గుల్జార్, ఆరోగ్యశ్రీ సీఈవో డాక్టర్ మల్లిఖార్జున్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.