ఏపీలో పునరుద్ధరించిన కోవిడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రం చైర్మన్ గా టీటీడీ ఈవో కె.ఎస్.జవహర్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. తక్షణం కోవిడ్ కమాండ్ కంట్రోల్ విధుల్లో చేరాల్సిందిగా ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో కరోనా నివారణ, వ్యాక్సినేషన్ ప్రక్రియ తదితర అంశాల పర్యవేక్షణకు కోవిడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరించిన విషయం తెలిసిందే. కరోనా నివారణ, వ్యాక్సినేషన్ పర్యవేక్షణకు 21 మంది ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అధికారులతో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. టాస్క్ ఫోర్సులో సీనియర్ ఐఏఎస్ అధికారులు కృష్ణబాబు, రవిచంద్ర, పీయూష్ కుమార్, బాబు.ఎ, మల్లికార్జున్, విజయరామరాజు, అభిషేక్ మహంతి, శ్రీకాంత్ వంటి అధికారులు ఉన్నారు. 13 జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించారు.