భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయనకు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మన్మోహన్ సింగ్ కు కరోనా పాజిటివ్ గా తేలడంతో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. కాగా కోవిడ్ నియంత్రణ చర్యలపై కేంద్రానికి మన్మోహన్ సింగ్ పలు సూచనలు చేసిన విషయం తెలిసిందే.