బిహార్ ప్రభుత్వం కరోనా కట్టడి కోసం కఠిన ఆంక్షలను విధించింది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఆ రాష్ట్రంలో కర్ఫ్యూ విధించనున్నట్లు ప్రకటించింది. అలాగే ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు గంట ముందే మూసివేయాలని ఆదేశించింది. విద్యాసంస్థలు, మతపరమైన సంస్థలు మే 15 వరకు పూర్తిగా మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇలా పలు కఠిన ఆంక్షలతో పరోక్షంగా పాక్షిక లాక్ డౌన్ ను ప్రకటించింది.