కరోనా వైరస్ కు సంబంధించి రోజుకో కొత్త లక్షణం బయటపడుతుంది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ తాజాగా కరోనా వైరస్ కొత్త లక్షణాలను వెల్లడించింది. నాలుక రుచి కోల్పోవడంతో పాటు నోట్లో పొక్కులు, నోరు పొడిబారడం, నోట్లో లాలాజలం ఊరకపోవడం వంటి సమస్యలు కొంత మందిలో బయటపడుతున్నాయి. నీళ్లు తాగితే నాలుక మండడం, నాలుక తడారిపోయి నాలుక పై తెల్ల మచ్చలు ఏర్పడడం వంటి లక్షణాలు కరోనా లక్షణాలుగా ఎన్ఐహెచ్ తెలిపింది. కనుగుడ్డు నుంచి కూడా వైరస్ శరీరంలోనికి చేరుతోందని, వారిలో కళ్లు ఎర్రబడుతున్నట్టుగా చెబుతున్నారు. ఇవే కాకుండా కీళ్లనొప్పులు, మైయాల్జియా, జీర్ణసంబంధ సమస్యలు, ఆకలి లేకపోవడం,అసాధారణ దగ్గు,బ్రెయిన్ పనితనం తగ్గడం,వినికిడి బలహీనత వంటి లక్షణాలు కూడా కొత్తగా వెలుగు చూస్తున్నాయి.