ఇండియాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. నిన్న ఒక్క రోజే దేశంలో 1027 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. గత 6 నెలల్లో ఒక్క రోజులో నమోదైన అత్యధిక మరణాలు ఇవే కావడం గమనార్హం. దేశంలో గడించిన 24 గంటల్లో ఏకంగా 1,84,372 కేసులు నమోదయ్యాయి. తాజాగా 82,339 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో ఇప్పటివరకు కరోనా బారిన పడిన వాళ్ల సంఖ్య 1,38,73,825కు చేరింది. కోలుకున్న వారి మొత్తం సంఖ్య 1,23,36,036గా ఉంది. ప్రస్తుతం 13,65,704 యాక్టివ్ కేసులు ఉన్నాయి.