ఈజిప్టులో ఘోర ప్రమాదం జరిగింది. దక్షిణ ఈజిప్టులో ఓ బస్సు బోల్తా పడటంతో 20 మంది మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. రాజధాని కైరో నుంచి అసియుట్కు వెళ్తున్న బస్సు.. ఓ ట్రక్కును ఓవర్టేక్ చేస్తుండగా అదుపుతప్పి బోల్తా పడింది. బోల్తాపడిన బస్సును ట్రక్కు ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో రెండు వాహనాలు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో 20 మంది మరణించగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని దవాఖానకు తరలించారు.
దేశంలో రోడ్డు ప్రమాదాల వల్ల ప్రతి ఏడాది వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. 2019లో జరిగిన రోడ్డుప్రమాదాల వల్ల సుమారు 10 వేల మంది మృతిచెందారని అధికారులు వెల్లడించారు. ఈమధ్యకాలంలో మరో 3480 మంది మరణించారని తెలిపారు.