కాకినాడలో జరిగిన తూర్పుగోదావరి జిల్లా డీఆర్సీ సమావేశంలో వైసీపీ సీనియర్ నేతలు పిల్లి సుభాష్ చంద్రబోస్, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బహిరంగంగా పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి వాగ్వాదంపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. తనను కలవాలంటూ ఇరువురు నేతలకు సీఎం జగన్ వర్తమానం పంపారు. దీంతో ఇద్దరు నేతలు హుటాహుటీన అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంకు చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఎం.. వారిద్దరినీ వివరణ కోరి.. డీఆర్సీ సమావేశంలో రచ్చపై ఇరువురి నేతలతో వివరణ తీసుకున్నట్టు తెలుస్తోంది.