భారత ప్రభుత్వం టిక్టాక్ సహా 59 చైనా యాప్ లను నిషేధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. చైనా ప్రభుత్వానికి చెందిన ది గ్లోబల్ టైమ్స్ కథనం ప్రకారం.. భారత సర్కారు నిర్ణయంతో టిక్టాక్, హెలో మాతృ సంస్థ అయిన బైట్డ్యాన్స్ 6 బిలియన్ డాలర్లు నష్టపోనుంది. అంటే సుమారు రూ.45,000 కోట్లను కోల్పోనుంది. మొబైల్ యాప్ అనాలిసిస్ కంపెనీ సెన్సార్ టవర్ లెక్కల ప్రకారం భారతదేశంలో టిక్టాక్ను మేలోనే 11.2 కోట్ల సార్లు డౌన్లోడ్ చేశారు. ప్రపంచమంతా చూసినా భారతదేశంలోనే ఎక్కువగా టిక్టాక్ యూజర్లు ఉన్నారు. అమెరికా కన్నా రెట్టింపు సంఖ్యలో టిక్టాక్ యూజర్లు ఇండియాలో ఉన్నారు. భారత ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలతో చైనా పెట్టుబడిదారులు, వ్యాపారుల విశ్వాసానికి తీవ్ర దెబ్బ తగిలిందని గ్లోబల్ టైమ్స్ విశ్లేషించింది.