భారత్ 59 చైనా యాప్స్ పైన నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఐతే ఇందులో ప్రధానంగా పబ్జీ గేమ్ గురించి ఇప్పుడు చర్చ జరుగుతుంది. పబ్జీ గేమ్ పై కూడా నిషేధం విధించాలని డిమాండ్లు వస్తున్నాయి. పబ్జీ గేమ్ చైనా యాప్ అని చాలా మంది అనుకుంటున్నారు. అసలు పబ్జీ గేమ్ ను దక్షిణ కొరియాకి చెందిన గేమ్ స్టూడియో బ్లూహోల్ తయారుచేసింది. ఈ గేమ్ పాపులర్ అయ్యాక చైనా కంపెనీ టెన్సెంట్ చైనాలో అనుమతించేందుకు డీల్ కుదుర్చుకుంది. ఆ తర్వాత టన్సెంట్ డిస్ట్రిబ్యూషన్ హక్కులు పెంచుకుంటూ పోతుంది. దీంతో ఈ గేమ్ యాజమాన్య హక్కులు ఇప్పుడు ఒక్కరి చేతుల్లో లేవు. అందువల్లే భారత్ పబ్జీ గేమ్ పై నిషేధం విధించలేదు.
అదే విధంగా జూమ్ యాప్,వాట్సాప్ కూడా చైనా యాప్ లు కావు. జూమ్ని సృష్టించింది ఎరిక్ యువాన్ స్థాపించిన కంపెనీ. ఈయన చైనా-అమెరికన్. కానీ అమెరికా పౌరసత్వం ఉంది. జూమ్, జూమ్ వీడియో కమ్యూనికేషన్స్ యాప్స్ ఉన్న కంపెనీ అమెరికాలో ఉంది. అందువల్ల జూమ్ యాప్ ని నిషేధించే అవకాశం లేదు. వాట్సాప్ చైనాకి చెందిన యాప్ కాదు. వాట్సాప్ ఫేస్బుక్ నిర్వహిస్తున్న యాప్. ఐతే ఫేస్బుక్ పై చాలా ప్రైవసీ విమర్శలు ఉన్నాయి. వాటికి చైనాతో సంబంధం లేదు. అందువల్ల వాట్సాప్కి ఇండియాలో ఎలాంటి ఢోకా లేదు. అందువల్లే భారత్ ఈ 3 యాప్ లపై నిషేధం విధించలేదు.