ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. గత 24 గంటల్లో ఏపీలో 657 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 15,252కి చేరింది. ఇప్పటి వరకు కరోనాతో కోలుకొని 6988 మంది డిశ్చార్జ్ కాగా 193 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 8071 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపూర్ 1689,చిత్తూరు 1089,తూర్పు గోదావరి 1209,గుంటూరు 1426,కడప 1000,కృష్ణా 1519,కర్నూలు 2045,నెల్లూరు 641,ప్రకాశం 398,శ్రీకాకుళం 63,విశాఖపట్నం 563,విజయనగరం 161,పశ్చిమగోదావరి 1010 కేసులు నమోదయ్యాయి. ఇతర రాష్ట్రాలకు చెందిన 2036 మందికి కరోనా సోకగా 403 మంది విదేశీయులకు కరోనా పాజిటివ్ గా తేలింది.