దేశంలో నిత్యం రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదువుతున్నాయి. అయితే, అదే స్థాయిలో కోలుకుంటున్న వారి సంఖ్య కూడా ఉండడం కాస్తా ఊరట కలిగించే అంశమని అంటు వ్యాధుల నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 58.24 శాతానికి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశంలో 13, 940 మంది కోలుకొని డిశ్చార్జ్ అవ్వగా.. ఇప్పటి వరకూ మొత్తం 2, 85, 636 మంది కోలుకున్నారు. దేశంలో మొత్తం నమోదవుతున్నకేసుల్లో 70శాతం కేసులు మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, గుజరాత్, ఉత్తరప్రదేశ్ లోనే నమోదవుతుండడం అక్కడి ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. కరోనా టెస్టులకు గడిచిన 24 గంటల్లో 11 కొత్త ల్యాబ్ లను దేశ వ్యాప్తంగా ప్రారంభించారు. దీంతో మొత్తం ల్యాబ్ల సంఖ్య 1016కు చేరింది.