రాష్ట్రంలో కొత్తగా 796 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో అత్యథికంగా 11 మంది మృతి చెందారు. కొత్తగా నమోదైన కేసుల్లో రాష్ట్రానికి చెందిన వారు 740 మంది కాగా, ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 51 మంది, ఇతర దేశాలనుంచి వచ్చినవారు ఐదుగురు ఉన్నారు. ఇప్పటి వరకూ ఏపీలో మొత్తం 12,285 కరోనా కేసులు నమోదు కాగా.. వీరిలో 157మంది మృతి చెందారు.