బంగారం ధరలు మళ్ళీ పెరిగాయి. బులియన్ మార్కెట్లో గురువారం బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి. మరో వైపు వెండి ధరలు స్వల్ప తగ్గుదల నమోదు చేసింది. హైదరాబాద్ లో గురువారం బంగారం 22 క్యారెట్లు 10 గ్రాములకు 250 రూపాయలు పెరిగింది. దీంతో 46,350 రూపాయల వద్ద నిలిచింది. ఇక 24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాములకు 170 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 50 వేల రూపాయల మార్కును దాటి 50,560 రూపాయల వద్ద నిలిచింది. ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 250 రూపాయలు పెరిగింది. దీంతో 46,350 రూపాయల వద్ద నిలిచింది. ఇక 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 170 రూపాయల పేరుదల నమోదు చేసింది. దీంతో 50 వేల రూపాయల మార్కును దాటి 50,560 రూపాయల వద్ద నిలిచింది. కేజీ వెండి ధర 50 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో కేజీ వెండి ధర 48,450 రూపాయలకు చేరుకుంది.