ఎల్జీ పాలిమర్స్ ఘటనపై ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ గడువును ప్రభుత్వం పెంచింది. జూన్ 30 వరకు హైపవర్ కమిటీ నివేదిక సమర్పణకు ప్రభుత్వం గడువు ఇచ్చింది. అటవీ, పర్యావరణశాఖ చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన హైపవర్ కమిటీ ఏర్పాటైంది. ఈ నెల 22 తో హైపవర్ కమిటీ గడువు ముగియనున్నది. మరింత సమయం కావాలని కమిటీ కోరడంతో జూన్ 30 వరకు గడువు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.