మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు సీఐడీ కార్యాలయానికి చేరుకున్నారు. సిఐడి అదుపులో ఉన్న నలంద కిషోర్ ని కలిసేందుకు గంటా శ్రీనివాస రావు వచ్చారు. విచారణ జరుగుతున్నందున సిఐడి ఆఫీసులోకి అనుమతించలేదు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ... నలంద కిషోర్ పై సీఐడీ అధికారుల తీరు సరికాదు అని అన్నారు. నలంద కిషోర్ అరెస్టు ఖండిస్తున్నా అని అయన అన్నారు. కిషోర్ దేశద్రోహం, రక్షణ వ్యవహారాలు లీక్ చేయలేదు అని గంటా శ్రీనివాస రావు అన్నారు. సోషల్ మీడియాలో వచ్చిన ఫార్వార్డ్ మెసేజ్ ను షేర్ చేశా అని చెప్పారు. చాలామంది వేల మెసేజ్ లు షేర్ చేస్తుంటారు. మఫ్టీలో ఉన్న పోలీసులు అరెస్ట్ చేయాల్సిన అంత సమస్య కాదు అని అన్నారు. ఏదైనా ఉంటే నన్ను టార్గెట్ చేయండి, నా సన్నిహితులపై కాదు అని అన్నారు.