ఎటిఎం చార్జీలు పెంచాలని ఆర్బీఐకి కమిటీ సూచించింది. క్యాష్ విత్ డ్రా లిమిట్ రూ. 5 వేలకు తాగించేందుకు యోచిస్తుంది. రూ. 5 వేల కంటే ఎక్కువ విత్ డ్రా చేస్తే అదనపు చార్జీలు ? విధించే అవకాశం ఉంది. ఆర్బీఐ డేటా ప్రకారం ప్రస్తుతం ఇండియాలో 2,27,000 ఏటీఎంలు పనిచేస్తున్నాయి. ఇందులో 21,300 ఏటీఎంలు వైట్లేబల్ మెషిన్స్ కాగా, మిగిలినవి బ్యాంకులు నిర్వహిస్తున్నాయి. ఖర్చులు పెరగడంతో 2018 తర్వాత నుంచి బ్యాంకులు కొత్తగా ఏటీఎంలను ఏర్పాటు చేయడం తగ్గించేశాయి. ఇండియాలో ప్రతి ఐదు ఏటిఎంలలో ఒక ఏటీఎం మాత్రమే గ్రామీణ ప్రాంతాలలో విస్తరించి ఉందని ఆర్బీఐ డేటా పేర్కొంది. కేవలం ప్రైవేట్ బ్యాంకుల పరంగా చూస్తే ప్రతి 10 ఏటీఎంలలో ఒక ఏటీఎం మాత్రమే గ్రామాల్లో విస్తరించి ఉంది. భవిష్యత్తులో ఏటీఎంల విస్తరణ మెరు గుపడడానికి ఏటీఎం ఇంటర్చేంజ్ ఫీజు పెంచాలని సీఏటీఎంఐ తెలిపిం ది. 2019 లో హైలెవెల్ కమిటీ ఇచ్చి న రికమెండేషన్లను వేగంగా అమలు చేయాలని కోరింది.