సోమవారం బ్రాహ్మణ వీధి లోని దేవదాయ శాఖ మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావును నూతన కమిషనర్ ఆఫ్ పోలీస్ బత్తిన శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా సీపీకి మంత్రి పలు సూచనలు చేశారు.నగరంలో రౌడీ షీటర్ పై నిఘా ఉంచాలని, శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వ్యాపారుల ను ఇబ్బంది పెట్టొద్దు అన్నారు.లాక్ డౌన్ సమయంలో పోలీస్ సేవలను మంత్రి ఈ సందర్భంగా ప్రశంసించారు...