శ్రీకాకుళంలోని పురుషోత్తపురం చెక్ పోస్ట్ వద్ద పోలిసుల తనిఖీలో భారీగా గొడ్డు మాంసం బయటపడింది. పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా పురుషోత్తపురం చెక్ పోస్ట్ వద్ద ఉన్న కంటైనర్ నుంచి 26,000 కిలోల గొడ్డు మాంసం స్వాధీనం చేసుకున్నారు. ఇచాపురం సబ్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ దీనిపై మాట్లాడుతూ... 1300 ప్యాకెట్ల గొడ్డు మాంసం కంటైనర్ లో ఉన్నట్లు తెలిపారు. ఒక్కొక్కటి ప్యాకెట్ 20 కిలోల బరువు ఉన్నట్లు తెలిపారు. పోలీసులు గొడ్డుమాంసాన్ని స్వాధీనం చేసుకొని కంటైనర్ ను సీజ్ చేశారు. పోలీసులు 2 డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరిని పోలీసులు విచారిస్తున్నారు.