ట్రెండింగ్
Epaper    English    தமிழ்

108పై కూడా జగన్ ప్రభుత్వం అవినీతికి పాల్పడింది : టీడీపీ నేత పట్టాభిరాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 21, 2020, 02:32 PM

పేదవాళ్ల కోసం పనిచేస్తున్న 108 అంబులెన్స్‌లపై కూడా జగన్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని టీడీపీ నేత పట్టాభిరాం విమర్శించారు. జగన్‌ ప్రభుత్వ అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోయిందన్నారు. 108 అంబులెన్స్‌ల కొనుగోళ్లలోనూ కమీషన్లు దండుకున్నారని ఆరోపించారు. జగన్‌ ప్రభుత్వానికి పేదల ఆరోగ్యం పట్ల ఏమాత్రం శ్రద్ధ లేదని పట్టాభి విమర్శించారు.


గత టీడీపీ ప్రభుత్వం 108 అంబులెన్స్‌లకు సంబంధించి జీవీకే సంస్థ కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత సెప్టెంబర్ 2016లో టెండర్లకు పిలిచి మళ్లీ జీవీకే సంస్థకు ఇచ్చిందని.. ఎక్కడ అవినీతికి తావులేకుండా చాలా పారదర్శకంగా జరిగిందని చెప్పారు. ఆ తర్వాత కూడా కొన్ని అంశాలపై కాంటాక్టుకు సంబంధించి కోర్టుకు వెళితే..న్యాయస్థానం కూడా సంస్థ నియమనిబంధనలు పాటించిన తర్వాతే ప్రభుత్వం అప్పగించిందని చెప్పిన చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. 31-12-2017 నుంచి జీవీకే సంస్థ 108 అంబులెన్స్‌ల నిర్వహణ ప్రారంభించిందన్నారు. ఈ అగ్రిమెంట్ ఐదేళ్లవరకు ఉంటుందని తెలిపారు. అంటే మూడేళ్ల వరకు ప్రభుత్వంతో ఒప్పందమని, ఆ తర్వాత రెండేళ్లు ఇరువైపుల అంగీకారంతో పొడిగిచుకునే విధంగా అగ్రిమెంట్ చేయడం జరిగిందన్నారు. మొదటి మూడేళ్ళకు 12-12-2020 వరకు ఇది అమలులో ఉంటుందని చెప్పారు. మరిన్ని వివరాల కోసం పై వీడియో క్లిక్ చేయండి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com