ఏపీలో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది. రోజుకు 400కి పైగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో పదో తరగతి పరీక్షల నిర్వహణ పై సర్కార్ డైలమాలో పడినట్టు తెలుస్తోంది. ఇప్పటికే జనసేన,టీడీపీ విద్యార్దుల ప్రాణాలతో చెలగాటమాడొద్దని,పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నాయి. దీంతో పరీక్షల నిర్వహణకు సంబంధించి గురు,శుక్రవారాల్లో అధికారులు చర్చించారు. పదో తరగతి పరీక్షల నిర్వహణకు సంబంధించి రెండు రోజుల్లో సర్కార్ కీలక ప్రకటన చేయనుందని సమాచారం. పరీక్షల వాయిదాకే సర్కార్ మొగ్గు చూపుతునట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. కరోనా కేసుల నేపథ్యంలో షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహిస్తారా? లేదంటే రద్దు చేస్తారా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.