కర్నూలు జిల్లా : శ్రీశైలం సూర్య గ్రహణం కారణంగా ఈ రోజు రాత్రి 10 గంటల నుండి శ్రీశైలం ఆలయ ద్వారాలు మూసివేత. గ్రహణం అనంతరం 21వ తేదీ (రేపు ) సాయంత్రం 4.30 గంటలకు తెరవ నున్న ఆలయ ద్వారాలు.ఆలయ శుద్ధి సంప్రోక్షణ అనంతరం స్వామి అమ్మవార్లకు పూజలు నిర్వహించనున్నారు.రేపు సాయంత్రం వరకు ఆలయ ద్వారాలు మూసివేస్తున్న కారణంగా భక్తులను దర్శనానికి అనుమతించే అవకాశం లేదు.సూర్య గ్రహణం కారణంగా శ్రీశైలం ఆలయ ప్రాంగణంలోని పరివార ఆలయాలు, సాక్షి గణపతి, హటకేశ్వరం ,పాలదార, పంచదార, శిఖరం ,ఉపాలయాణాలు కూడా మూసివేసి 21వ తేదీన(రేపు) సాయంత్రం 4.30 గంటలకు సంప్రోక్షణ పూజలు నిర్వహించనున్నారు.