'కరోనా’ పాజిటివ్తో తమిళనాడు రాష్ట్ర మంత్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారనే వార్తల వస్తున్న నేపథ్యంలో డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ఫోన్లో ఆ మంత్రి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ విషయాన్ని స్టాలిన్ తన ట్విట్టర్లో తెలిపారు. ఆయన త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని మళ్ళీ ప్రజాసేవలో చురుకుగా పాల్గొనాలని, ప్రజా సేవలో పాల్గొనే వారు జాగ్రత్తగా ఉండాలని స్టాలిన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఓ మంత్రికి కరోనా సోకడం ఇదే ప్రథమం. ఇప్పటికే డీఎంకే ఎమ్మెల్యే జె.అన్బళగన్ కరోనా కారణంగా మృతిచెందగా, అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే, డీఎంకేకు చెందిన మాజీ ఎమ్మెల్యే పాజిటివ్ లక్షణాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.