పాకిస్థాన్లో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. చాలా మంది మాస్కులు పెట్టుకోకపోవడం, సోషల్ డిస్టన్స్ పాటించకపోవడం వంటివి చేయడం వల్ల కరోనా కేసులు పెరిగిపోతున్నాయని ఆ దేశ ప్రభుత్తం గుర్తించింది. దీంతో ఫైసలాబాద్ పోలీసులు ఓ కొత్త నిర్ణయం తీసుకున్నారు. ప్రజలకు కరెంటు షాక్ ఇస్తే అప్పుడు కచ్చితంగా మాస్క్ వాడతారని భావించిన పోలీసులు విదేశాల నుంచి కరెంట్ షాక్ ఇచ్చే ప్రత్యేక ఎలక్ట్రిక్ షాట్ గన్ పరికరాల్ని తెప్పించారు. అవి లాఠీల లాగా ఉంటాయి. బటన్ నొక్కి మనిషికి అంటిస్తే చాలు కరెంటు షాక్ కొడుతుంది. పోలీసులు షాక్ ట్రీట్మెంట్ మొదలుపెట్టినప్పటి నుంచి ప్రజలకు టెన్షన్ మొదలైంది. దీంతో అందరూ బుద్ధిగా మాస్కులు ధరించి బయటకు వస్తున్నారు. పోలీసులు తీసుకున్న ఈ చర్య వల్ల ఇప్పుడు పాకిస్థాన్ లోని ఫైసలాబాద్లోనూ మాస్క్ వాడకం బాగా పెరిగింది.