జగనన్న చేదోడు పథకం ప్రారంభమైంది. క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. ఆన్ లైన్ ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు బదిలీ చేయనున్నారు. షాపులున్న రజకులు, నాయి బ్రాహ్మణులు, టైలర్లకు రూ. 10 వేలు సాయం అందిస్తున్నారు. ఏపీ వ్యాప్తంగా అర్హులైన రజకులు 82,347 మంది ఉన్నారు. నాయీ బ్రాహ్మణులు 38,767 మంది, టైలర్లు 1,25,926 మంది ఉన్నారు. చేదోడులో అర్హులైన వారు ఇంకా దరఖాస్తు చేసుకోవచ్చు మేనిఫెస్టోలో హామీ ఇచ్చాం వాటిని అమలు చేస్తున్నామని సీఎం జగన్ అన్నారు. ప్రతి ఒక్కరికి చేయూత అందించడమే ప్రభుత్వం లక్ష్యం అని సీఎం జగన్ అన్నారు.