అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 218 కేసులు నమోదయ్యాయి. కరోనాతో తూర్పు గోదావరి జిల్లాలో ఒకరు మృతి చెందారు. 218 కేసుల్లో విదేశాల నుంచి వచ్చిన 56 మంది ఉన్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన 26 మంది ఉన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ మొత్తం 5,247 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 2,330 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకూ 2,515 మంది కరోనా బాధితులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం ఎపిలో 78 మంది కరోనాతో మృతిచెందారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ను విడుదల చేసింది.