ఏపీ సీఎం జగన్ నేడు ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది. కానీ ఆఖరి నిమిషంలో ఆయన పర్యటన వాయిదా పడింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు ఆయన పలువురు మంత్రులను కలవాల్సి ఉంది. కానీ అమిత్ షా అపాయిట్ మెంట్ దొరక్క పోవడంతో సీఎం జగన్ తన ఢిల్లీ టూర్ వాయిదా వేసుకున్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించి సీఎం కార్యాలయం ఇప్పటి వరకు ప్రకటన చేయలేదు.