ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్న నేపధ్యంలో వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ పాటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే లాక్డౌన్ సమయంలో ప్రజలెవరూ ఇళ్ళ నుంచి బయటకి రాకండని ప్రభుత్వాలు ఆదేశిస్తున్నా కొందరు మాత్రం లాక్డౌన్ రూల్స్ పాటించడంలేదు.అయితే టీడీపీ అద్యక్షుడు నారా చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ లాక్డౌన్ రూల్స్ బ్రేక్ చేశాడంటూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై విమర్శల వర్షం కురిపించారు. కరోనా విపత్తుతో కష్టాలను దిగమింగుతూ దేశంలో కోట్లాది మంది ప్రజలు గడప దాటకుండా లాక్డౌన్ను పాటిస్తుంటే చంద్రబాబు సుపుత్రుడు ‘మాలోకం’ మాత్రం లాక్డౌన్ను ఉల్లంఘించి యధేచ్చగా రోడ్లపై చక్కర్లు కొడుతూ ‘మాతృభాష’లో కొడుకు దేవాన్ష్కు స్కేట్బోర్డు నేర్పిస్తున్నాడు. హ్యాట్సాఫ్! అంటూ సెటైర్లు గుప్పించారు.