ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిన్న ఒక్కరోజే ఏపీలో 5,400 కరోనా టెస్టులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 19, 2020, 10:20 PM

కరోనా’ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా ప్రజలు పలు ముందుజాగ్రత్తలు పాటిస్తున్న విషయం తెలిసిందే. ఏపీలో ‘కరోనా’ కట్టడిలో భాగంగా దక్షిణ కొరియా నుంచి లక్ష ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు దిగుమతి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ టెస్ట్ కిట్లను జిల్లాల వారీగా అందించి భారీగా కరోనా టెస్టులు చేయాలన్నది సర్కారు యోచన. అయితే, ఈ ర్యాపిడ్ కిట్లను వినియోగించకుండానే ఏపీ ప్రభుత్వం గణనీయమైన పురోగతి కనబరుస్తోంది. దేశం మొత్తమ్మీద అత్యధిక కరోనా టెస్టులు చేస్తున్న రాష్ట్రాల్లో రెండో స్థానంలో నిలిచింది. ఈ విషయంలో రాజస్థాన్ మొదటిస్థానంలో ఉంది. ప్రతి 10 లక్షల మందికి రాజస్థాన్ లో 685 పరీక్షలు నిర్వహిస్తుంటే, ఏపీలో 539 పరీక్షలు చేపడుతున్నారు. నిన్న ఒక్కరోజే ఏపీలో 5,400 కరోనా టెస్టులు చేశారు. ఈ మేరకు వైసీపీ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com