టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ నేత, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు అన్ని అవాస్తవాలే చెబుతున్నారని, ముఖ్యమంత్రి జగన్ ఆలోచన తీరు వలనే కరోనాను సమర్ధంగా ఎదురుకుంటున్నామని అన్నారు.అయితే కరోనా టెస్ట్లలో ఏపీ వెనకబడి ఉందని చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్రంలో మూడు విడతల సర్వే చేశాక 33 వేలమంది అనుమానితులను గుర్తించామని అందులో 24 వేలమందికి చెకప్ చేశామని సజ్జల అన్నారు. ఇకపోతే ప్రధాని మోదీకి లాక్డౌన్ పెంచాలని చంద్రబాబు సలహా ఇచ్చానని చెబుతున్నాడని ఆయన నోటికి అడ్డు అదుపు అనేది లేకుండా మాట్లాడుతున్నారని సజ్జల విమర్శించారు.