లాక్ డౌన్ కు సంబంధించి కేంద్రం కొన్ని మార్గదర్శకాలను బుధవారం జారీ చేసింది. ఇందులో కొన్నింటికి మినహాయింపునిచ్చింది. ఇవి ఏప్రిల్ 20 తర్వాత అమల్లోకి వస్తాయి. అప్పటి వరకు యదావిధిగానే లాక్ డౌన్ కొనసాగుతుంది.
కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి.
- రాష్ట్రాల మధ్య అన్ని రకాల రవాణా బంద్.
- దేశ వ్యాప్తంగా వ్యవసాయం,అనుబంధ రంగాలకు అనుమతి.
- గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమల నిర్వహణకు అనుమతి.
- పరిమితంగా నిర్మాణ రంగాలకు అనుమతి.
- కాఫీ,తేయాకుల్లో 50 శాతం మ్యాన్ పవర్ కు అనుమతి.
- పట్టణ పరిధిలో లేని అన్ని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు అనుమతి.
- మే 3 వరకు విమానాలు,రైళ్లు,బస్సులు రద్దు.
- నిర్మాణ రంగ పరిశ్రమలకు సంబంధించిన స్థానికులకు మాత్రమే అనుమతి.
- గ్రామాల్లో భవన, ఇళ్ల నిర్మాణ రంగ కార్యకాలపాలు నిర్వహించుకోవచ్చు.
- అన్ని రకాల ఈ కామర్స్ సర్వీసులకు అనుమతి.
- పబ్లిక్ లో ఖచ్చితంగా మాస్క్ లు ధరించాలి.
- హాట్ స్పాట్ కేంద్రాలలో జనసంచారం ఉండకూడదు.
- ఆరుబయట ఉమ్మి వేయడం ఇకపై చట్ట ప్రకారం నేరం. దానికి జరిమానా విధింపు.
- హాళ్లు, మాల్స్, షాపింగ్ కాంప్లెక్సులు, జిమ్లు, స్పోర్ట్స్ కాంప్లెక్సులు, స్విమ్మింగ్ పూల్స్, బార్లు మే 3 వరకు తెరవకూడదు.
- రాష్ట్రాల మధ్య, అలాగే జిల్లాల మధ్య ప్రజల ప్రయాణాలు, రాకపోకలపై మే 3 వరకు నిషేధం.
- సామాజిక, రాజకీయ, క్రీడా, మతపరమైన కార్యక్రమాలు, వేడుకలు, ఫంక్షన్లు నిర్వహించకూడదు.
- అన్ని ప్రార్థనా స్థలాలూ, దేవాలయాలు బంద్.
- విద్యాసంస్థలు, ట్రైనింగ్, కోచింగ్ కేంద్రాలు తెరవకూడదు.
- అంత్యక్రియల కార్యక్రమాల్లో 20 మందికి మించి పాల్గొనకూడదు.
- ఆస్పత్రులు, నర్సింగ్ హోమ్స్, క్లినిక్స్, టెలిమెడిసిన్ సర్వీసులు రోజూ పనిచేస్తాయి.
- డిస్పెన్సరీస్, కెమిస్ట్స్, ఫార్మసీస్, అన్ని రకాల మందుల షాపులు, జన ఔషధి కేంద్రాలు తెరిచే ఉంటాయి.
- మెడికల్ ల్యాబ్స్, వైద్య ఉత్పత్తుల కలెక్షన్ కేంద్రాలు తెరిచే ఉంచవచ్చు.
- ఉపాధి హామీ పనులకు అనుమతి. ఉపాధి హామీ కూలీలు భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించి పని చేయాలి.
- గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు,సాగునీటి,తాగునీటి ప్రాజెక్టులకు అనుమతి.
- లిక్కర్,గుట్కా,పొగాకు ఉత్పత్తుల పై నిషేధం.
- ఎంట్రీ,ఎగ్జిట్ ప్రాంతాలలో శానిటైజేషన్ తప్పనిసరి.
- కార్యాలయాల్లో ఒకరికొకరికి మధ్య 6 అడుగుల దూరం ఉండాలి. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలూ లాక్డౌన్ నిబంధనల్ని కఠినంగా అమలు చెయ్యాలని కేంద్రం ఆదేశించింది. అవసరమైతే రాష్ట్రాలు స్థానికంగా అవసరాన్ని బట్టీ ఇంకా కఠినమైన చర్యలు తీసుకోవచ్చని కేంద్రం తన మార్గదర్శకాల్లో తెలిపింది.