ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకు చాలా దారుణంగా తయారవుతున్నాయి. ఈ మేరకు అధికార వైసీపీ నేతలు మరియు, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతల మధ్యన గత కొంతకాలంగా తీవ్రమైన మాటల యుద్దాలు జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. కాగా తాజాగా వైసీపీ పార్టీ కీలక నేత, పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రదబాబు పై తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, తన అధికారిక ట్విట్టర్ వేదిక ద్వారా కొన్ని సెటైరికల్ వాఖ్యలు చేశారు. కాగా ప్రధాని మోడీ, చంద్రబాబు కి ఫోన్ కాల్ చేశారని చెప్పుకుంటున్నారు కానీ, ఆలా ఫోన్ కాల్ చేయడం ప్రధాని మోడీ గొప్పతనమని, ఒక పాతికసార్లు ప్రాధేయ పడితే ప్రధాని నరేంద్ర మోదీ, చంద్రబాబు కి కాల్ చేసి ఉంటారని ఎద్దేవా చేశారు.కాగా ఈ మేరకు ఎంపీ విజయసాయి రెడ్డి తన అధికారిక ట్విట్టర్ వేదిక ద్వారా “ప్రధాని మోదీ పారిశుద్ధ్య కార్మికులతో, నర్సింగ్ సిస్టర్లతో, కరోనా నుంచి కోలుకున్న వారితో కూడా మాట్లాడారు. నిత్యం ఎంతో మందికి ఫోన్లు చేసి ప్రశంసిస్తారు. పరామర్శిస్తారు. ఆయన వినమ్రత అది. పాతికసార్లు ప్రాధేయ పడితే కాల్ చేసి ఉంటారు. దాన్ని కూడా రాజకీయాలకు వాడుకుంటే నవ్వొస్తోంది”… అని పోస్టు చేశారు.